Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (13:56 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని సినీ హీరోయిన్ నిహారిక అన్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, శ్రీతేజ్ అనే బాలుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో అల్లు అర్జున్‌కు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. కానీ, మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోలు ఒక్కరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాను హీరోయిన్‌గా నటించిన మద్రాస్ కారన్ అనే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న నిహారిక మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని చెప్పారు. మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. అందరి మద్తుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నారని చెప్పారు. 
 
తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుంటుంటామని చెప్పారు. రామ్ చరణ్ అన్నతో ఎంతో సరదాగా ఉంటానని చెప్పారు. లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ప్రతి సినిమాకు ఆయన స్టైల్ మారుస్తుంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments