Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (13:56 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని సినీ హీరోయిన్ నిహారిక అన్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, శ్రీతేజ్ అనే బాలుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో అల్లు అర్జున్‌కు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. కానీ, మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోలు ఒక్కరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాను హీరోయిన్‌గా నటించిన మద్రాస్ కారన్ అనే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న నిహారిక మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని చెప్పారు. మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. అందరి మద్తుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నారని చెప్పారు. 
 
తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుంటుంటామని చెప్పారు. రామ్ చరణ్ అన్నతో ఎంతో సరదాగా ఉంటానని చెప్పారు. లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ప్రతి సినిమాకు ఆయన స్టైల్ మారుస్తుంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments