Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ అవార్డు గ్రహీత, 'బాహుబలి' కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కోవిడ్‌తో కన్నుమూత

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (20:50 IST)
జాతీయ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కోవిడ్-19తో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. COVID-19 బారిన పడిన వెంటనే డ్యాన్స్ మాస్టర్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. గత కొన్నిరోజులుగా ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఐతే ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు తుదిశ్వాస విడిచారు ఆయన వయస్సు 72. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


సోనూసూద్, ధనుష్, మెగాస్టార్ చిరంజీవి తదితర నటులు కొరియోగ్రాఫర్ చికిత్స కోసం శివశంకర్ చిన్న కుమారుడు అజయ్‌కు ఆర్థిక సహాయం అందించారు. 'మగధీర’లోని ‘ధీర ధీర’ పాటకు కొరియోగ్రఫీకి గానూ జాతీయ అవార్డు అందుకున్నారు. అతని ప్రసిద్ధ తెలుగు సినిమాలలో ‘అమ్మోరు’, ‘అరుంధతి’, ‘మహాత్మ’, ‘బాహుబలి ది బిగినింగ్’ ఉన్నాయి.
 
 
1948లో చెన్నైలో జన్మించిన శివశంకర్ మాస్టర్ తమిళ చిత్రాలలో తన వృత్తిని ప్రారంభించారు. అయితే ఆయన అన్ని భారతీయ భాషల సినిమాలలో పనిచేశారు. 'ఢీ', 'ఆటా జూనియర్స్' వంటి తెలుగు టీవీ డ్యాన్స్ షోలతో కొత్త తరం ప్రేక్షకులలోనూ ఆయన ప్రజాదరణ పొందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments