Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ

డీవీ
శనివారం, 31 ఆగస్టు 2024 (15:11 IST)
Rama Rao, Rishabh Shetty
నేడు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో ఆనందహేళ మొదలైంది. రిషబ్ శెట్టికి కాంతార చిత్రానికి కాను జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇక ఆర్.ఆర్.ఆర్. లో రామారావుకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో వార్-2 సినిమాను రామారావు చేస్తున్నాడు. మరోవైపు తెలుగులో చేస్తున్న దేవర సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. 
 
కాగా, ఇటీవలే జిమ్ లో కసరత్తు చేసి ఎడమచేయి బెణకడంతో రెస్ట్ తీసుకున్న రామారావు ఇప్పుడు బయటకు రావడంతో మరో షూటింగ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇంకొందరైతే కాంతార 2లో ఎన్.టి..ఆర్. గెస్ట్ రోల్ చేస్తున్నాడమోనని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వీరిద్దరి కలయిక ఆనందంగా వుందనే చెప్పాలి. కాగా, బెంగుళూరుకు ఎన్టీఆర్ త‌న అమ్మమ్మ ఊరు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.  రామారావు అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. దీంతో ఈ ఇద్ద‌రికి మంచి రిలేషన్ వుందనే టాక్ కూడా నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments