Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ తరహాలోనే మోక్షజ్ఞ కూడా... వెండితెర ఎంట్రీ

వెండితెరపై వెలుగులు వెలిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుల వారసులైన బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు వారి వారసులు కొంతమంది

Webdunia
గురువారం, 19 జులై 2018 (11:15 IST)
వెండితెరపై వెలుగులు వెలిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుల వారసులైన బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు వారి వారసులు కొంతమంది ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా మరికొందరు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు.
 
అక్కినేని కుటుంబ కథా చిత్రం "మనం" సినిమా ద్వారా అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. 'మనం'లో గెస్ట్ రోల్ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 
 
ఇకపోతే, నందమూరి రెండోతరం వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమౌతున్నాడు. మూడేళ్ళ క్రితమే మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొద్దామని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. 
 
ఈ నేపథ్యంలో బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేద్దామని దర్శకుడు క్రిష్ కోరగా, అందుకు బాలయ్య అంగీకరించలేదు. ఇప్పుడు సమయం రావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు.  
 
నూనూగు మీసాల వయసులో నిమ్మకూరులో అల్లరి చిల్లరిగా తిరిగే ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో మోక్షజ్ఞ కనిపించబోతున్నట్టు సమాచారం. మోక్షజ్ఞ రోల్ 15 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. మరి యంగ్ ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments