Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిసిసి' కోసం కింగ్ నాగార్జున రూ.కోటి విరాళం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:09 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. దీంతో సినీ ఇండస్ట్రీ కూడా స్తంభించిపోయింది. ఫలితంగా అనేక మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో 'కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం' పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటైంది. దీనికి చిరంజీవి తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 
 
ఇపుడు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కూడా రూ.కోటి విరాళం ప్రకటించారు. "లాక్‌డౌన్ అనేది భయంకర వాస్తవం, తప్పనిసరి పరిస్థితి. ఈ విపత్కర సమయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చిన నా సహనటులకు అభినందనలు. కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం నేను రూ.కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. మనందరినీ దేవుడు చల్లగా చూస్తాడు. అందరూ ఇళ్లలో సురక్షితంగా ఉండండ' అని నాగార్జున ట్వీట్ చేశారు. 
 
అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన వంతు సాయం ప్రకటించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో తిండి దొర‌క‌క ఇబ్బంది ప‌డుతున్న సినీ కార్మికుల‌కి త‌న వంతుసాయంగా రూ.25 ల‌క్ష‌లు ఇవ్వనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటున్న నేప‌థ్యంలో వారి కోసం రూ.25 లక్షలు ప్రకటిస్తున్నట్లు మహేష్ బాబు తెలిపారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ కూడా రూ.25 లక్షలు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో "సిసిసి మనకోసం" (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ ఏర్పాటు చేశారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంక‌ర్, సి క‌ల్యాణ్, దాము క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments