Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె విషయంలో అంతా క్లియర్ : నాగబాబు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో దాడి చేశారు. ఈ దాడుల్లో మెగా డాటర్ నిహారికతో పాటు అనేక మంది సినీ రాజకీయ నేతల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిహారికను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అంటూ వెల్లడించారు. అందువల్ల తన కుమార్తె గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పబ్‌లో తన కుమార్తె నిహారిక ఉండటం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 
 
అయితే, తన కుమార్తె విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఇక ఈ విషయంపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశ్యంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments