Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె విషయంలో అంతా క్లియర్ : నాగబాబు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో దాడి చేశారు. ఈ దాడుల్లో మెగా డాటర్ నిహారికతో పాటు అనేక మంది సినీ రాజకీయ నేతల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిహారికను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అంటూ వెల్లడించారు. అందువల్ల తన కుమార్తె గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పబ్‌లో తన కుమార్తె నిహారిక ఉండటం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 
 
అయితే, తన కుమార్తె విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఇక ఈ విషయంపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశ్యంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments