నా కుమార్తె విషయంలో అంతా క్లియర్ : నాగబాబు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో దాడి చేశారు. ఈ దాడుల్లో మెగా డాటర్ నిహారికతో పాటు అనేక మంది సినీ రాజకీయ నేతల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిహారికను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అంటూ వెల్లడించారు. అందువల్ల తన కుమార్తె గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పబ్‌లో తన కుమార్తె నిహారిక ఉండటం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 
 
అయితే, తన కుమార్తె విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఇక ఈ విషయంపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశ్యంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments