Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మత్తు'తో నాకు సంబంధమే లేదు : సినీ నటి హేమ

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (15:17 IST)
హైదరాబాద్ నగరంలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఈ డ్రగ్ కల్చర్ తగ్గడం లేదు. పబ్‌లు, రేవ్ పార్టీల్లో జోరుగా సరఫరా అవుతుంది. తాజాగా ఓ నక్షత్ర హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ పబ్ పార్టీలోనూ లిక్విడ్ డ్రగ్ సరఫరా అయినట్టు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి హేమ స్పందించారు. 
 
ఈ కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఏ సంబంధం లేదని తనను ఎందుకు బదనాం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇందులో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, సినీ నటి, మెగా డాటర్ నిహారిక రొణిదెలతో పాటు పలువురు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి నోటీసులిచ్చి వదిలివేశారు. అయితే, ఆ పబ్‌కు తాను వెళ్లలేదని, కానీ కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తన పేరును ప్రస్తావిస్తూ అభాండాలు వేస్తున్నాయని నటి హేమ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments