Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మత్తు'తో నాకు సంబంధమే లేదు : సినీ నటి హేమ

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (15:17 IST)
హైదరాబాద్ నగరంలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఈ డ్రగ్ కల్చర్ తగ్గడం లేదు. పబ్‌లు, రేవ్ పార్టీల్లో జోరుగా సరఫరా అవుతుంది. తాజాగా ఓ నక్షత్ర హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ పబ్ పార్టీలోనూ లిక్విడ్ డ్రగ్ సరఫరా అయినట్టు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి హేమ స్పందించారు. 
 
ఈ కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఏ సంబంధం లేదని తనను ఎందుకు బదనాం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇందులో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, సినీ నటి, మెగా డాటర్ నిహారిక రొణిదెలతో పాటు పలువురు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి నోటీసులిచ్చి వదిలివేశారు. అయితే, ఆ పబ్‌కు తాను వెళ్లలేదని, కానీ కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తన పేరును ప్రస్తావిస్తూ అభాండాలు వేస్తున్నాయని నటి హేమ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments