Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి సీజన్‌లో సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయ్

డీవీ
మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:40 IST)
Sankranthi movies
ఇటీవలే తెలంగాణలో సినిమా టికెట్ల పెంపుదలకు, బెనిఫిట్ షోలకు నో చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఎటువంటి వివరణ లేదు. కానీ తాజాగా ఎ.పి.లో సంక్రాంతి సీజన్‌లో సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయ్అ ని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’.. నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’.. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపైనే సినిమా పెద్దలు, నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
విశ్వసనీయ సమాచారం మేరకు, ఏపీలో  గేమ్ ఛేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135, మల్టీప్లెక్స్‌లలో రూ.175 మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ రేట్లు రూ.600కు పెంచుకునే విధంగా ఉండబోతుంది. అలాగే ‘డాకు మహారాజ్’ చిత్రానికి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపుకు అనుమతినిచ్చారు. ఈ చిత్ర బెనిఫిట్ షోకు రూ.500 మేర పెంపుకు అనుమతినిచ్చారు. మరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపు ఉండనుంది. ఈసారి సంక్రాంతికి మూడు సినిమాల సక్సెస్ ఏ స్థాయిలో వుంటుందో చూడాలి. ఇక తెలంగాణాలో చివరి నిముషంలో పెంచే సూచనలు కూడాలేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments