Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో వెంటబడ్డాడు... కానీ...

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (11:45 IST)
తెలుగువాడైన తమిళ హీరో విశాల్‌పై ఓ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో పెళ్లి చేసుకోవాలంటూ విశాల్ తన వెంటపడ్డాడని ఆ నటి చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు... మీరా మిథున్. అయితే, తనకు డబ్బున్నవారిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక విశాల్ ప్రతిపాదనను తోసిపుచ్చినట్టు చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ మీరా మిథున్ గతంలో తమిళ హీరోలు విజయ్, సూర్యలపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగి చేదు అనుభవాలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె తన పంథాను మార్చుకోలేదు. తాజాగా హీరో విశాల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. హీరో విశాల్ తనను వివాహం చేసుకోవాలని కోరుతూ మూడేళ్లు తిరిగాడని ఆమె తెలిపింది.
 
తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే, తనకు మాత్రం డబ్బున్న వాళ్లను వివాహమాడటం ఇష్టం లేదని, అందువల్లే తాను విశాల్ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. మీరా మిథున్ వ్యాఖ్యల వీడియోను ఆమె మేనేజర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.
 
కాగా, ఇటీవల రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపైనా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై మీరా చేసిన వ్యాఖ్యల గురించి విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా, విశాల్‌లో హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమాయణం ఉన్న విషయం తెల్సిందే. ఒక సందర్భంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు కూడా వినిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments