పస్తులుండి పైకొచ్చా, మనోజ్ ఇక నువ్వు ఇంట్లో అడుగు పెట్టొద్దు: మోహన్ బాబు ఆడియో

ఐవీఆర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (22:26 IST)
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో విడుదల చేసారు. తన ముగ్గురు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాననీ, అందరికంటే మనోజ్ కే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసానని అన్నారు. అలాంటిది తన గుండెల మీద తన్నినంత పని చేసాడనీ, సమాజంలో తన గౌరవ మర్యాదలు మంటగలిపాడని ఆవేదన చెందారు.
 
మోహన్ బాబు మాటల్లోనే.. మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను‌. నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావ్‌. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు. ఏదో ఒకటి రెండు పెగ్గులు తాగడం హద్దు కానీ నువ్వు తాగుడికి బానిసలా మారిపోయావు. పనిచేసే వాళ్లని కొడుతున్నావు. మనల్నే నమ్ముకుని వచ్చినవారిని కొట్టడం మహాపాపం రా. కుటుంబంలో గొడవలను కొన్ని మీడియా ఛానళ్లు రకరకాలుగా రాస్తున్నాయి. నేను ఆవేదన చెందుతున్నాను. అందుకే ఈ ఆడియో ద్వారా జరిగినది ఏమిటో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. 
 
కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డాం. మనోజ్ నాపైన చేయి చేసుకోలేదు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి‌. ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావు‌. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అయినా కాపాడాను. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. ఈ ఇల్లు ఎవరికి రాయాలన్నది నా ఇష్టం. 
 
ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా, వద్దా అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, నాకు జన్మనిచ్చాడు. మదరాసులో ఒక్కపూట తిని పస్తులుండి కష్టపడి సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడిన రోజులు గడిపాను. ఐనా ఎవర్నీ మోసం చేయలేదు. కష్టించి పైకి వచ్చాను. అటువంటిది ఇది నా ఇల్లు అంటున్నావు. ఇది నీ ఇల్లు కాదు. నేను కష్టపడి సంపాదించుకున్నది.
 
 
మనోజ్... వింటున్నావా... నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. మీ అమ్మ వచ్చిన తర్వాత నీ కుమార్తెను ఆమెతో పంపిస్తాను. ఇక ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టు" అంటూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments