Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 రోజులు రూ.205 కోట్లు.. "భరత్ అనే నేను" కలెక్షన్స్...

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూర్తి రాజకీయ కోణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం గత నెల 20వ తేదీన

Webdunia
బుధవారం, 16 మే 2018 (14:12 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూర్తి రాజకీయ కోణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం గత నెల 20వ తేదీన విడుదలై ఇప్పటికీ 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఏకంగా రూ.205 కోట్ల గ్రాస్‌, రూ.95 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.65.32 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
పైగా, మహేష్ బాబు సినీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మిగిలిపోయింది. అలాగే, "బాహుబలి" చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కిన రామ్ చరణ్ "రంగస్థలం" చిత్రాన్ని అధికమించింది. ప్రస్తుతం టాప్-3 కలెక్షన్ల జాబితాలో 'బాహుబలి', 'భరత్ అనే నేను', 'రంగస్థలం' చిత్రాలు ఉన్నాయి. 
 
ఇకపోతే, 'భరత్ అనే నేను' చిత్రాన్ని కొనుగోలు చేసిన, పంపిణీ చేసిన వారికి లాభాల పంట పడుతోంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టగా, మరొకొన్ని ఏరియాల్లో లాభాలకి చేరువలో వుంది. దర్శకుడిగా కొరటాలకి గల ఇమేజ్ .. మహేశ్ బాబుకి గల క్రేజ్ .. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments