Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత దర్శకులందరినీ మహేష్ బాబు ఆహ్వానిస్తున్నాడట..! ఎందుకో తెలుసా..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (17:33 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ముందుకు సాగిపోతున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. 1999వ సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడుతో తెలుగు తెరకు హీరోగా పరిచయమై, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తాజాగా మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. 
 
అయితే ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రం కావడం గమనార్హం. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. 
 
ఇది తన సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో మహేష్ బాబు గత 24 చిత్రాల దర్శకులందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. 
 
ఇందులో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్దే కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments