Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితంలో ఓ లేడీ బాస్ వుంద‌న్న‌ మ‌హేష్ బాబు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (12:15 IST)
Namrita Shirodkar
ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక మ‌హిళ వుంటుంద‌ని అంటుంటారు. అలా త‌న జీవితంలో లేడీబాస్ ఒక‌రు వున్నారంటూ మ‌హేష్‌బాబు చెబుతుండేవారు. తాజాగా ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 4న రాబోయే ఇంట‌ర్య్వూలో కూడా ఆయ‌న ఈ మాట‌ను ప్ర‌స్తావించారు. ఇక ఈరోజు న‌మ్ర‌త శిరోద్క‌ర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు త‌న జీవితంలో ఓ లేడీ బాస్ వుందంటూ.. ఆమె త‌న భార్య అంటూ స‌ర‌దాగా మాట్లాడారు. అలాగే `మేజ‌ర్‌` సినిమా టీమ్ కూడా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఆ సినిమా నిర్మాత ఆమెనే.
 
1972 జ‌న‌వ‌రి 22న పుట్టిన న‌మ్ర‌త విద్యాభ్యాసం త‌ర్వాత మోడ‌లింగ్ చేసింది. 93లో మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది. బాలీవుడ్‌లో సినిమా చేస్తూనే తెలుగులో 2000వ సంవ‌త్స‌రంలో `వంశీ` సినిమాతో ప్ర‌వేశించింది. అందులో మ‌హేష్‌బాబు హీరో. ఇద్ద‌రూ ఆ సినిమాలో స‌మ‌యంలోనే ప్రేమ‌లో ప‌డ్డారు. నాలుగేల్ళ త‌ర్వాత `అత‌డు` సినిమా టైంలో ముంబైలో వారిద్ద‌రూ పెండ్లి చేసుకున్నారు. వారికి గౌత‌మ్‌, సితార పిల్ల‌లున్నారు. 
 
న‌మ్ర‌త ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో చాలా సింపుల్‌గా వుంటుంది. త‌న‌కు ఆమె భార్య‌నేకాదు వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారుకూడా అని మ‌హేష్‌బాబు చెప్పారు. మ‌హేష్ ప‌లు యాడ్స్ చేసినా, సినిమా నిర్మాణ సంస్థ స్థాపించినా అందుకు కార‌ణం న‌మ్ర‌త‌నే. ప‌ర్స‌న‌ల్‌గా మ‌హేష్ విషయాలు అన్నీ చూసుకుంటుంది. ఆహార నియ‌మాలు ఎలా పాటించాలోకూడా చెబుతుంటుంది. నా విష‌యాలే కాక ఇంటి విష‌యాలు, పిల్ల‌ల విష‌యాలు చూసుకుంటూ న‌మ్ర‌త చాలా శ్ర‌మిస్తుంద‌ని మ‌హేష్‌బాబు ట్వీట్ చేశాడు కూడా.
 
ఎక్కువగా కుటుంబంతో గ‌డిపే మ‌హేష్‌బాబు ఈసారి మ‌రోసారి విదేశాల‌కు వెళుతున్నారు. ఇటీవ‌లే త‌న సోద‌రుడు మ‌ర‌ణం త‌ర్వాత కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. న‌మ‌త్ర‌కు సినీ ప్ర‌ముఖుల్లో త‌న‌కు స్నేహితులుగా వున్న‌వారితో పార్టీలు కూడా జ‌రుపుకుంటుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కూడా వుంది. అందులో ఆమె చూపించిన టిప్స్‌కూ మంచి ఆద‌ర‌ణ వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments