Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబుకు ప్రకాష్ రాజ్ పాదాభివందనం.. నిన్న తిట్టుకున్నారు.. నేడు..?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (11:15 IST)
maa elections
మా ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా ప్రారంభమైంది. నిన్నవరకు నువ్వా నేనా అన్నట్టుగా మొదలైన ఈ ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన ప్రకాష్ రాజ్-మంచు విష్ణులు ఒకరిని ఒకరు హగ్ చేసుకున్నారు.
 
ఇక మోహన్ బాబుకు ప్రకాష్ రాజ్ పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. వారించిన మోహన్ బాబు భుజం తట్టి ఆశీర్వదించారు. తాజా మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే ఉండడం విశేషం. నిన్నటిదాకా బండ బూతులు తిట్టుకున్న ఈ రెండు గ్రూపులు ఈరోజు కలిసిపోయి హగ్ చేసుకోవడమే ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు.
 
రెండు ప్యానళ్ల నుంచి పోటీచేస్తున్న సభ్యులు పోలింగ్‌ను సాధ్యమైనంత ఎక్కువ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు తుది ఫలితం వస్తుందని అంటున్నారు.
 
హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్ పబ్లిక్ స్కూలుకు ఓటు వేసేందుకు సినీ సెలబ్రెటీలు తరలివస్తున్నారు. ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులున్నారు. వీరిలో 883మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments