Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్‌లో ఇదే నా డ్యూటీ : చిరంజీవి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:55 IST)
కరోనా వైరస్ గొలుసు కట్టును అడ్డుకునేందుకు దేశం లాక్‌డౌన్‌లో ఉంది. 130 కోట్ల మంది ప్రజానీకం ఇపుడు తమతమ గృహాలకే పరిమితమైవున్నారు. ఈ విషయంలో పేదోడు.. సెలెబ్రిటీ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో ఉంటున్నారు. అయితే, సెలెబ్రిటీలు లాక్‌డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో తమ ఇంటి పనుల్లో నిమగ్నమైవున్నారు. వాటిని వారు ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్లో తాను చేస్తున్న పనులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాజాగా త‌న ఇంట్లోని మొక్క‌ల‌కి నీళ్లు ప‌డుతూ కనిపించాడు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ ఫోటో కింద "మొక్కే క‌దా అని వ‌దిలేస్తే.." అని తాను నటించిన "ఇంద్ర" సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌ని జ‌త చేశాడు. షూటింగ్ లేని కార‌ణంగా ప్ర‌తి రోజు ఇదే నా డ్యూటీ అంటూ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు చిరు. ఆయ‌న ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో "ఆచార్య" అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments