Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ బోర్డుపై కేసు పెడ్తా : రాంగోపాల్ వర్మ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (16:43 IST)
తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన రిలీజ్ చేయాలని ఆయన భావించారు. కానీ, ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసే వరకూ సినిమా సెన్సార్‌ను వాయిదా వేస్తామని బోర్డు తెలిపింది. 
 
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది. దీంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
ఈ నేపథ్యంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ప్రధాన ఇతివృత్తమని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments