Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ బోర్డుపై కేసు పెడ్తా : రాంగోపాల్ వర్మ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (16:43 IST)
తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన రిలీజ్ చేయాలని ఆయన భావించారు. కానీ, ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసే వరకూ సినిమా సెన్సార్‌ను వాయిదా వేస్తామని బోర్డు తెలిపింది. 
 
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది. దీంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
ఈ నేపథ్యంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ప్రధాన ఇతివృత్తమని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments