Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల కోసం వెంపర్లాడుతున్న కియారా

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (16:59 IST)
కియారా అద్వానీ అంటే గుర్తొచ్చేది "భరత్ అనే నేను" సినిమా. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి వచ్చిన ఈ భామ మొదటి చిత్రంలోనే సూపర్‌స్టార్ మహేశ్‌తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కియారా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. దీంతో అదే నిర్మాణ సంస్థలో మరో చిత్రం చేయడానికి అవకాశం కొట్టేసింది. అయితే ఈ సారి అంచనాలు తలకిందులయ్యాయి. 
 
బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ సరసన "వినయ విధేయ రామ" చిత్రంలో జతకట్టినప్పటికీ, చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోయే సరికి కాస్త నిరాశలో పడింది. మరోపక్క బాలీవుడ్‌లో 'అర్జున్‌ రెడ్డి' రీమేక్‌గా వస్తున్న "కబీర్ సింగ్" చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. 
 
తెలుగులో ఆఫర్లు లేక బాలీవుడ్ వైపే మొగ్గు చూపుతోంది. 'కబీర్ సింగ్' చిత్రం మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందని బోలెడన్ని ఆశలతో ఉంది. ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్లు కరువై అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా ఆమె తెలుగులో నటించడం అనేది మూన్నాళ్ల ముచ్చటగా ముగుస్తుందో లేదో సమయమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments