మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (12:39 IST)
హీరోయిన్ కీర్తి సురేష్ తన తల్లిదండ్రులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కీర్తి సురేష్ త్వరలోనే వివాహం చేసుకోనున్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను నటించిన "బేబీజాన్" హిందీ చిత్రం విడుదలకానుందని, ఆ తర్వాత వచ్చే నెలలో తన పెళ్లి జరుగనుందని, అందుకే కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
కాగా, తన పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ప్రియుడు ఆంటోనీతో దీపావళి పండుగ సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోను తన ఇన్‌‍స్టాలో షేర్ చేశారు. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలెబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వీరిద్దరూ వచ్చేనెల వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. డిసెంబరు 11, 12వ తేదీల్లో గోవాలో జరుగనుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments