Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అట్లీ బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.. ముగ్గురు హీరోయిన్లలో..?

అట్లీ బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.. ముగ్గురు హీరోయిన్లలో..?

సెల్వి

, శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:35 IST)
రఘుతాత చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి జవాన్ దర్శకుడు, కీర్తి సురేష్ స్నేహితుడు అట్లీ కూడా నిర్మాతగా వహిస్తున్నాడు. 
 
తమిళంలో తెరకెక్కనున్న తేరీ చిత్రానికి రీమేక్‌గా బేబీ జాన్ రాబోతుంది. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. 
 
అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో బాలీవుడ్‌లోని ఇద్దరూ టాప్ హీరోలు కథానాయకులుగా నటిస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, వీరిలో కీర్తి సురేష్ ఒకరని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!