Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్తూరిపై కేసు.. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో..?

దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. తమిళనాడులో 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్ప

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (10:49 IST)
దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. తమిళనాడులో 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్పందించడంపై నటి ఇబ్బందుల్లో చిక్కుకుంది. 
 
మూడు రోజుల క్రితం అనర్హత కేసులో తీర్పు వెలువడగా, తమిళంలో హిజ్రాలను సంబోధించే ఒంబోదు.. అనే పదాన్ని వాడుతూ కస్తూరి ఓ ట్వీట్ పెట్టింది. కోర్టు తీర్పు అటూ ఇటూ కానిదన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలపై హిజ్రాలు భగ్గుమన్నారు.
 
మైలాపూర్‌లోని కస్తూరి ఇంటి ఎదుట తీవ్ర నిరసన తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము కూడా సగటు మనుషులమేనన్న సంగతిని కస్తూరి మరచిందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని హిజ్రాల సంఘాలు డిమాండ్ చేశాయి. హిజ్రాలు ఇచ్చిన ఫిర్యాదుపై మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కస్తూరిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments