Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ కుమ్మేస్తున్నాడు.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం..

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (18:16 IST)
ఆవారా, ఊపిరి ఫేమ్ కార్తీ తాజాగా నటించిన ఖైదీ సినిమా.. తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన విడుదలైంది. అయితే కార్తీ వరుస పరాజయాలతో వున్న కారణంగా ఈ సినిమాను అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఖైదీ వసూళ్ల పరంగా అదరగొడుతోంది. కథానాయికగానీ, పాటలుగాని ఉండవనే సరికే పట్టించుకోవడం మానేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 30 లక్షల షేర్‌ను మాత్రమే రాబట్టింది.
 
తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పుంజుకున్నాయి. మరుసటి రోజున ఈ సినిమా రూ.90 లక్షల షేర్‌ను వసూలు చేసింది. ఇక మూడవ రోజున 1.30 కోట్ల షేర్‌ను సాధించింది. ఇలా 'ఖైదీ' వసూళ్లు రోజు రోజుకీ పెరుగుతూ వెళుతున్నాయి. తమిళంలోనే కాదు.. తెలుగులోను ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
 
కార్తీ నటించిన తాజా చిత్రం ‘ఖైదీ’ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం పెద్దగా తెలుగు సినిమాలు లేకపోవడంతో ఖైదీ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా సేఫ్‌ జోన్‌కు చేరుకుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. డ్రగ్స్ మాఫియా, పోలీసుల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఖైదీకి తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments