Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీగా సీక్వెల్ వచ్చేస్తోంది, మళ్లీ అందర్నీ మెప్పిస్తానంటున్న హీరో

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (15:39 IST)
యుగానికొక్కడు, ఆ తర్వాత ఆవారా సినిమాలతో తమిళ హీరో కార్తీ తెలుగునాట మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ మధ్యలో వేగం తగ్గిందనే చెప్పాలి. చివరిగా వచ్చిన చినబాబు, దేవ్ చిత్రాలు ఆశించిన మేరకు హిట్ కొట్టలేకపోయాయి. తాజాగా విభిన్న కథాంశంతో ప్రయోగం చేస్తూ తీసిన ఖైదీ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో కార్తీ ఆనందంలో మునిగిపోయాడు.
 
ఈ సినిమాతో పాటుగా తమిళ హీరో విజయ్ నటించిన బిగిల్ సినిమా కూడా రిలీజైంది. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో రిలీజైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రెండు డబ్బింగ్ సినిమాల కోసం భారీ సంఖ్యలో తెలుగునాట థియేటర్లను కేటాయించారు. పెద్ద సినిమాలేవీ లేకపోవడం దీనికి కారణం. మొదటి రోజున ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లను సాధించినప్పటికీ క్రమంగా విజయ్ నటించిన విజిల్ కంటే ఖైదీ ఎక్కువ ఎక్కువ వసూళ్లను సాధించిది.
 
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఖైదీ సినిమాను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్స్... నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులలో నా వెన్నంటి ఉన్న సోదర సోదరీమణులందరూ గర్వపడేలా నేను కష్టపడి పని చేస్తూనే ఉంటాను.. మీ కోసం ఢిల్లీ మళ్లీ వస్తాడు అంటూ సీక్వెల్‌ను ప్రకటించేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments