Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కళ్యాణం కమనీయం" నుంచి "అయ్యో ఏంటో నాకు" లిరికల్ సాంగ్ రిలీజ్

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (16:42 IST)
Kalyanam Kamaneeyam
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి "అయ్యో ఏంటో నాకు" అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా స్వీకర్ అగస్తి పాడారు. 'అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే' అంటూ భార్యభర్తలైన హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట. 
 
ఈ చిత్రం నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతున్న పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఆల్బమ్ ఛాట్ బస్టర్ అవుతోంది. మ్యూజికల్  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా    "కళ్యాణం కమనీయం" ఈ నెల 14న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments