Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ మరణం... ఫ్యాన్స్‌కు తారక్ ఏం చెప్పారంటే?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (13:41 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న తారక్‌కు మే 20వ తేదీన పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ ఏడాది ఎలాంటి వేడుకలొద్దని.. తన పుట్టిన రోజును జరుపుకోవద్దని ఫ్యాన్స్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎందుకంటే.. గత ఏడాది జూన్‌లో తారక్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు. అందుకే తారక్ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయిచుకున్నారట. ప్రస్తుతం తారక్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
 
ఇకపోతే.. ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో ఫొటోలో వైరలైన సంగతి తెలిసిందే. చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్‌కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌‌కు జోడిగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. మొదట్లో బాలీవుడ్ నటి డైసీని ప్రకటించినప్పటికీ ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments