Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్..

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (10:26 IST)
కేజీఎఫ్ దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్టుగా ప్రశాంత్ కథని సిద్ధం చేస్తుండగా, 2021 చివరలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. 
 
భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నారు. ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. 
 
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments