Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను టీ అడిగితే.. భర్తను కట్టేసి కొట్టింది..

భార్యను టీ అడిగితే.. భర్తను కట్టేసి కొట్టింది..
, గురువారం, 7 మే 2020 (10:32 IST)
Tea
లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా కుటుంబమంతా ఒకే చోట వున్న సందర్భాలు ఫాస్ట్ యుగంలో తక్కువే. కరోనా కారణంగా ప్రస్తుతం అలాంటి సందర్భం తిరిగివచ్చింది. అయితే ఆ సందర్భాన్ని కొందరు సద్వినియోగం చేసుకోకుండా మహిళలను హింసించడం చేస్తున్నారు. ఈ క్రమంలో గృహహింస పెరిగిపోయిందనే రిపోర్ట్ వచ్చింది. 
 
అలాగే కొందరు మహిళలు కూడా భర్తలు వాగ్వివాదాలకు దిగడంతో కుటుంబంలో వివాదాలు మొదలవుతున్నాయి. దీంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న చాలా గృహాల్లో జగడాలు చోటుచేసుకుంటున్నాయి. అలా ఓ చిన్న వివాదం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. 
 
వివరాల్లోకి వెళితే.. టీ తయారు చేసేవిషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఉదంతంలో భార్య, ఆమె సోదరుడితో సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఇన్‌ఛార్జి మహ్మద్ అస్లాం తెలిపారు. 
 
భర్త టీ పెట్టమని భార్యను కోరాడు. దీంతో ఆమె తాను టీ పెట్టలేనని, భర్తనే పెట్టుకోమని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో ఆ మహిళ తన సోదరుడిని పిలిచి, మరో ఇద్దరి సాయంతో భర్తను కట్టేసి కొట్టింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగువారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని వారి బారి నుంచి విడిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉక్కిరిబిక్కిరి - మాడిపోయిన చెట్లు - విగతజీవులుగా పశువులు