కేజీఎఫ్‌ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ఎవరితో ప్రభాస్‌తోనా? ఎన్టీఆర్‌తోనా?

Webdunia
గురువారం, 7 మే 2020 (22:24 IST)
కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన కేజీఎఫ్ సినిమా సక్సస్ సాధించడంతో అతనితో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపించారు. దీంతో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌ పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తెలుగు హీరోతోనే సినిమా చేయాలనుకున్నారు. 
 
అంతేకాకుండా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సినిమా చేసేందుకు అంగీకారం చెప్పడం కూడా జరిగింది. దీంతో మైత్రీ వాళ్లు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
 
అయితే.. ప్రశాంత్ నీల్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడు అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపించింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా అయిన తర్వాత ప్రభాస్ - ప్రశాంత్ మూవీ ఉంటుంది అనుకున్నారు. 
 
అయితే.. ప్రభాస్ ఆ సినిమా తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కి బాగా ఆలస్యం అయ్యేలా ఉంది. అందుచేత... ప్రశాంత్ నీల్ మరో హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటారా..? యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ని ప్రశాంత్ నీల్ కలవడం.. కథా చర్చలు జరగడంతో ఈ కాంబినేషన్లో మూవీ కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో ఈ సినిమాపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments