Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునకు ఏమైంది? తారక్‌తో గొడవలా?

Advertiesment
Nagarjuna
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:53 IST)
అక్కినేని నాగార్జున - నందమూరి తారక్ (జూనీయర్ ఎన్టీఆర్) వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జునను బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే.. తారక్‌ ది రియల్ మేన్ ఛాలెంజ్‌ను నాగార్జునకు విసిరారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ గురించి నాగార్జున స్పందించలేదు. 
 
పోనీ.. ట్విట్టర్లో యాక్టీవ్‌గా లేరా అంటే... ఇటీవల శివమణి సినిమాలోని డైలాగ్స్‌ను కరోనా వైరస్‌కి లింకుపెడుతూ ఎవరో పంపించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 
 
అంతేకాకుండా.. ఈ టైమ్‌లో శివమణి సినిమా చేస్తే.. పూరి జగన్నాథ్ డైలాగ్స్‌ను ఇలా రాస్తాడు అంటూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం. దీనికి పూరి కూడా స్పందిస్తూ.. సార్ మిస్ యు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 
 
మరి.. తారక్ ఛాలెంజ్‌ని నాగార్జున ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు..? ఎందుకు స్పందించలేదు..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగార్జునకు ఏమైంది..? తారక్‌తో గొడవలా..? లేక వేరే ఏదైనా ప్రాబ్లమా..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి.. నాగార్జున ఈ ఛాలెంజ్ గురించి స్పందిస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చమ్మక్ చంద్ర గురించి నాకంతా తెలుసు, స్వాతి నాయుడు గురించి సత్తిపండు