Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్' హౌస్‌కు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్లు.. ఇక సందడే సందడి...

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ముగింపు దశకు చేరుకోనుంది. ఈ షోలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా, మరికొందరు ఇం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (12:03 IST)
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ముగింపు దశకు చేరుకోనుంది. ఈ షోలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా, మరికొందరు ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు.
 
అదేసమయంలో ప్రతి శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉండే కొత్త చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు ఈ హౌస్‌లోకి ప్రవేశిస్తూ మరింత సందడి చేస్తున్నారు. ఈ కోవలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కొత్త చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన రిలీజ్ కానుంది. 
 
ఇందులో హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించారు. ఈ నటీమణులిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో వీరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదేసమయంలో శనివారం కావడంతో, జూనియర్ కూడా షోలో కనిపించనున్నాడు. 
 
మరోవైపు, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ప్రచారంలో భాగంగా నివేదా, రాశీ ఖన్నాలు బిగ్ బాస్‌లో సందడి చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments