ప్లీజ్... ఒక్క నిమిషం అలా ఉండండి... వేడుకున్న జూ.ఎన్టీఆర్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:29 IST)
ఏ సినిమా ఫంక్షన్‌కి హాజరైనా చివరన 'మీ కోసం వేచి చూసే వారు ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. ఈ సంతోషాన్ని వారితో కూడా పంచుకోండి..' అంటూ అభిమానులకు చెబుతూ ఉండే నందమూరి యువ హీరో ఎన్టీఆర్... ఈసారి ప్రసంగం ప్రారంభంతోనే ఆకట్టుకునేసాడు...
 
వివరాలలోకి వెళ్తే... నందమూరి కల్యాణ్ రామ్ - షాలిని పాండేలు జంటగా నటించిన చిత్రం ‘118’. ఈ సినిమా ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడేందుకు మైక్ అందుకున్న తారక్ ‘‘ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఓ ఘోరమైన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. 
 
మన దేశ భద్రత కోసం, మన భద్రత కోసం పని చేస్తున్న వారికి జరిగినటువంటి ఘోర సంఘటనకు గానూ.. మన దేశం కోసం అహర్నిశలూ కుటుంబాలను వదిలేసి పహారా కాస్తున్నటువంటి ఆ వీర జవాన్ల కోసం.. అలాగే ఈ మధ్య మా సినిమా ఇండస్ట్రీలో మేము కోల్పోయిన కొంత మంది దిగ్గజాల కోసం.. వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాలని మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను’’ అని కోరాడు. 
 
ఈ మాటతో అక్కడ ఉన్న వారంతా నిలబడి మౌనం పాటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. అతని అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments