Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... ఒక్క నిమిషం అలా ఉండండి... వేడుకున్న జూ.ఎన్టీఆర్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:29 IST)
ఏ సినిమా ఫంక్షన్‌కి హాజరైనా చివరన 'మీ కోసం వేచి చూసే వారు ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. ఈ సంతోషాన్ని వారితో కూడా పంచుకోండి..' అంటూ అభిమానులకు చెబుతూ ఉండే నందమూరి యువ హీరో ఎన్టీఆర్... ఈసారి ప్రసంగం ప్రారంభంతోనే ఆకట్టుకునేసాడు...
 
వివరాలలోకి వెళ్తే... నందమూరి కల్యాణ్ రామ్ - షాలిని పాండేలు జంటగా నటించిన చిత్రం ‘118’. ఈ సినిమా ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడేందుకు మైక్ అందుకున్న తారక్ ‘‘ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఓ ఘోరమైన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. 
 
మన దేశ భద్రత కోసం, మన భద్రత కోసం పని చేస్తున్న వారికి జరిగినటువంటి ఘోర సంఘటనకు గానూ.. మన దేశం కోసం అహర్నిశలూ కుటుంబాలను వదిలేసి పహారా కాస్తున్నటువంటి ఆ వీర జవాన్ల కోసం.. అలాగే ఈ మధ్య మా సినిమా ఇండస్ట్రీలో మేము కోల్పోయిన కొంత మంది దిగ్గజాల కోసం.. వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాలని మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను’’ అని కోరాడు. 
 
ఈ మాటతో అక్కడ ఉన్న వారంతా నిలబడి మౌనం పాటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. అతని అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments