Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డితో జాన్వీ కపూర్ సినిమా.. టాలీవుడ్ అరంగేట్రం ఖాయమైనట్టేనా?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (12:56 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం ఖరారైనట్లు తెలుస్తోంది. తొలి చిత్రం దఢక్‌లో మంచి నటనతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. తాజాగా తెలుగులో అర్జున్ రెడ్డి హీరోతో జతకట్టనుంది. ఈ బ్యూటీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను పూరీ జగన్నాథ్ తీసుకున్నారని టాక్. 
 
ఇటీవలే ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న పూరీ, తన నెక్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో, ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే జాన్వీ.. హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వస్తోంది. దీనికి తోడు జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరత్‌'‌‌కు రీమేక్‌గా ఓ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించారు. ప్రస్తుతం జాన్వీ.. కార్గిల్‌ గాళ్‌, రూహ్ అఫ్జా, తక్త్‌ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments