Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌ అరెస్టు.. 14 రోజుల రిమాండ్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (12:48 IST)
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను హైదరాబాద్ నగర జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన్ను గురువారం ఉదయం కడప జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన్ను కడప జిల్లా జైలుకు తరలించారు. 
 
కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి నుంచి బండ్ల గణేష్ 2011లో రూ.13 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తీర్చకపోవడంతో గత 2013లో గణేశ్‌పై మహేశ్ చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ వ్యవహారంలో బండ్ల గణేశ్‌పై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అయితే, కోర్టు విచారణకు గణేశ్ హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో, బండ్ల గణేశ్‌ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 
 
మరోవైపు, గురువారం ఉదయం బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేస్తూ, తనను ఏ పోలీసులు అరెస్టు చేయలేదనీ, ఓ కేసు విచారణ నిమిత్తం, చట్టంపై గౌరవం ఉండటంతో స్టేషన్‌కు వచ్చినట్టు ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేటికే బండ్ల గణేశ్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించడం గమనార్హం. దీంతో నవంబరు 4వ తేదీ వరకు ఆయన జైలులో ఉండనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments