Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన జాన్వీ కపూర్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:07 IST)
బాలీవుడ్‌ కథా నాయిక జాన్వీ కపూర్‌ తాజాగా రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసారు. విలాసవంతమైన రెసిడెన్షియల్‌‌లో క్వాలిటీగా పేరొందిన జుహూ విలే పార్లే స్కీం పక్కనే జాన్వీ కపూర్‌ కొనుగోలు చేసిన ఆస్తి ఉంది. ఇది బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం నివాసం పక్కనే.
 
అమితాబ్‌ బచ్చన్‌తోపాటు అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గన్‌, ఏక్తా కపూర్‌ తదితర సెలబ్రిటీల సొంత భవనాల పక్కనే జాన్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ తన కుటుంబంతో కలిసి లోఖండ్‌వాలాలో నివాసం ఉంటున్నారు.
 
2020 డిసెంబర్‌ 10వ తేదీన జాన్వీ కపూర్‌ ఈ ఆస్తిని రిజిస్టర్‌ చేయించుకున్నట్లు సమాచారం. సదరు బిల్డింగ్‌లోని 14,15, 16 అంతస్తుల్లో 4,144 చదరపు అడుగుల ప్లాట్లు ఆమె కొనుగోలు చేశారు. 
 
కాగా, 2018లో ఇషాన్‌ ఖట్టర్‌తో కలిసి 'ధడక్‌' చిత్రంతో జాన్వీ కపూర్‌ సినీ రంగంలోకి ప్రవేశించారు. మరాఠీలో సైరాత్‌ పేరుతో నిర్మించిన సినిమాకు 'ధడక్‌' రీమేక్‌. సైరాత్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments