Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనిర్మలమ్మ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (12:46 IST)
సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో సందేశాన్ని విడుదల చేశారు. నటిగా, దర్శక-నిర్మాతగా ఆమె సినీరంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సినిమాలను తెరకెక్కించిన విజయనిర్మల.. ఈ రంగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. విజయనిర్మలగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేనాని చెప్పారు. ఈ సందర్భంగా విజయనిర్మల భర్త సూపర్ స్టార్ కృష్ణ, కుమారుడు నరేశ్‌లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, సినీ దంపతులు జీవిత రాజశేఖర్లు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. నటిగాను .. దర్శక నిర్మాతగాను విజయనిర్మల గారు ఎన్నో విజయాలను సాధించారు. వ్యక్తిగానూ ఆమె ఎంతోమందికి సహాయ సహకారాలను అందించారు .. ఆమెతో ఎవరినీ పోల్చలేం. మాకు తెలిసిన దగ్గర నుంచి ఒక ఆడపులిగానే ఆమెను చూస్తూ వచ్చాము. అలాంటిది ఈ మధ్య నడవడానికి ఆమె ఇబ్బంది పడుతుండటం చూసి బాధ కలిగింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అంటూ తమ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments