Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనిర్మలమ్మ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (12:46 IST)
సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో సందేశాన్ని విడుదల చేశారు. నటిగా, దర్శక-నిర్మాతగా ఆమె సినీరంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సినిమాలను తెరకెక్కించిన విజయనిర్మల.. ఈ రంగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. విజయనిర్మలగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేనాని చెప్పారు. ఈ సందర్భంగా విజయనిర్మల భర్త సూపర్ స్టార్ కృష్ణ, కుమారుడు నరేశ్‌లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, సినీ దంపతులు జీవిత రాజశేఖర్లు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. నటిగాను .. దర్శక నిర్మాతగాను విజయనిర్మల గారు ఎన్నో విజయాలను సాధించారు. వ్యక్తిగానూ ఆమె ఎంతోమందికి సహాయ సహకారాలను అందించారు .. ఆమెతో ఎవరినీ పోల్చలేం. మాకు తెలిసిన దగ్గర నుంచి ఒక ఆడపులిగానే ఆమెను చూస్తూ వచ్చాము. అలాంటిది ఈ మధ్య నడవడానికి ఆమె ఇబ్బంది పడుతుండటం చూసి బాధ కలిగింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అంటూ తమ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments