Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు... ఇద్దరు హీరోయిన్లను వెంటబెట్టుకుని అక్కడికెళ్లాడు...

తెలుగు బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, చివరి ఎపిసోడ్లకు బాగా హీట్ పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. జై లవ కుశ టీంతో కలిసి... అంటే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్‌లతో కలిసి బిగ్ బాస్ హౌసుకు వెళ్లి

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (14:53 IST)
తెలుగు బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, చివరి ఎపిసోడ్లకు బాగా హీట్ పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. జై లవ కుశ టీంతో కలిసి... అంటే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్‌లతో కలిసి బిగ్ బాస్ హౌసుకు వెళ్లి సందడి చేస్తున్నాడు. 
 
ఇకపోతే ఈ షో ముగిసేందుకు మరో 9 రోజుల సమయం మాత్రమే వుంది. మరోవైపు ఈ షో ముగించే ముందు సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పైడర్ చిత్రంతో దసరాకు రానున్న మహేష్ బాబును సంప్రదించారట. ఐతే మహేష్ బాబు వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు.
 
దసరాకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జై లవ కుశ చిత్రం విడుదల కాబోతోంది. అదే రోజున మహేష్ బాబు చిత్రం స్పైడర్ కూడా విడుదలవబోతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ హౌసుకు వెళితే సంకేతాలు వేరేగా వెళ్లొచ్చనే అభిప్రాయంతో మహేష్ బాబు ఈ షోకి రాకూడదని భావించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ దసరా పండుగకు ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ బాబు కానుంది. మరి దసరా పండుగలో దసరా బుల్లోడు ఎవరో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments