Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న "జై లవ కుశ" (Trailer)

జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై

ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (06:01 IST)
జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న హీరో చెప్పిన డైలాగ్ అదిరిపోయేలా ఉంది.
 
ఈ పాత్రలకు సంబంధించిన టీజ‌ర్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ఆదివారం ట్రైల‌ర్‌‌ను రిలీజ్ చేసింది. ఇప్ప‌టికే యాట్యూబ్‌లో సాంగ్స్ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, తాజాగా విడుదలైన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. 
 
కాగా, ఇందులో రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే 2,630,646 మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించగా, 125 వేల మంది ఈ వీడియోను లైక్ చేయగా, ఆరు వేల మంది డిజ్‌లైక్ చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముగ్గురు హీరోలంటే నాకు చాలా ఇష్టం : నాగబాబు