Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుకు జబర్దస్త్ నటుడు హెచ్చరిక.. చింతామణిపై నిషేధం ఎత్తివేయాలి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 'జబర్దస్త్' నటుడు అప్పారావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణం ఈ నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పైగా, ఈ చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. గత 1920లో చింతామణి నాటకాన్ని కాళ్లకూరి నారాయణ రావు రాశారని చెప్పారు. ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలేగానీ, ఇలా నిషేధం విధించడం సబబు కాదన్నారు. 
 
అంతేకాకుండా, చింతామణి నాటకంపై నిషేధం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ విశాఖపట్టణంలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన దిగారు. ఇందులో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. 1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణ రావు ఆ నాటకాన్ని రాశారని గుర్తు చేశారు. అలాంటి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. కళాకారులను, కళలను ప్రోత్సహించాలని, చింతామణి నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments