Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (08:31 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు ప్రముఖ సినీ నిర్మాతల గృహాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా చేపట్టిన తనిఖీలు శుక్రవారంతో ముగిశాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం 16 చోట్ల 55 అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లతో పాటు.. సినీ దర్శక నిర్మాత సుకుమార్, పలువురు సినీ ఫైనాన్షియర్ల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
సినీ నిర్మాతలకు భారీ మొత్తంలో డబ్బులు సమకూర్చే ఫైనాన్షియర్లు సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్‌, నెల్లూరు ప్రతాప్‌ రెడ్డి గృహాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతోపాటు 'పుష్ప 2' సినిమా కలెక్షన్స్ వ్యవహారంపై ఆరాలు తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్‌మాల్‌ అయినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు వెల్లడించాల్సివుంది. 
 
మరోవైపు, ఈ ఐటీ దాడులపై హీరో విక్టరీ వెంకటేష్ వద్ద ప్రస్తావించగా, ‘ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయా? నిజమా? ఆ విషయం నాకు తెలియదు. మిగతా వాళ్ల విషయాన్ని పక్కనపెడితే.. నేను పారితోషికం మొత్తం వైట్‌లోనే తీసుకుంటా. నేను వైట్‌ వైట్‌. నా రెమ్యునరేషన్‌ కూడా తక్కువే కదా’ అని చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments