Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నా రక్తంలో లేదు: రాధా రవి

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:54 IST)
కొన్ని రోజుల క్రితం నయనతార గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రాధారవి.. వివాదం కాస్తా ముదరడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా సద్దు మణిగిందే. అయితే ఇటీవల తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయమై మరోసారి స్పందించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల ఓ లఘుచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గతంలో నయనతార విషయంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ... తాను తప్పుగా మాట్లాడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటానని చెప్పానే కానీ ఎవ్వరికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదని అన్నారు. 
 
అలా చెప్పడం తన రక్తంలోనే లేదని పేర్కొన్న ఆయన... అక్కడితో ఆగకుండా ‘‘నేను నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి? నేనేమైనా పెద్ద తప్పు చేసానా? ఈ రోజు నేను మాట్లాడుతుంటే జనం ఎలా అయితే చప్పట్లు కొడ్తున్నారో.. ఆ రోజు కూడా జనం అలాగే చప్పట్లు కొట్టారు. నిజం మాట్లాడిన ప్రతీ సారి జనం మద్దతు నాకే ఉంటుంది. నేను ఇక సినిమాల్లో నటించనని చాలా మంది బెదిరిస్తున్నారు... సినిమాలు కాకపోతే నాటకాలు చేసుకుంటా! ఇలాంటివన్నీ తాత్కాలికమే’’ అని రాధా రవి తెలపడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ప్రకటన మరెంత దుమారాన్ని రేపుతుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments