Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పట్ల చింతిస్తున్నా : ఊర్మిళ

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (16:07 IST)
కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధంపై చింతిస్తున్నట్టు బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ చెప్పారు. ఇటీవలే శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో తనకున్న కొద్దిపాటి అనుబంధం పట్ల చింతిస్తున్నానని పేర్కొన్నారు. 
 
ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేసే రాజకీయనేతగా ఉండటం తనకు ఇష్టం లేదని స్పష్టంచేశారు. తాను ప్రజల అభిమానంతోనే సినీ నటిగా ఎదిగానని, ఆ కోవలోనే ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నానని వివరించారు. 
 
అందుకే శివసేన పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. కులం, మతం పట్టించుకోనని, ప్రజల కోసమే పనిచేస్తానని ఊర్మిళ చెప్పుకొచ్చారు. ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
 
అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఎడంగా ఉంటున్నారు. శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినా ఊర్మిళ తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments