Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీకి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు... ఎందుకంటే?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (12:33 IST)
తెలుగు హీరో శివాజీని తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల విచారణ తర్వాత ఆయన్ను వదిలివేశారు. తాము పంపించిన నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించివేసినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల అలంద మీడియా(టీవీ9) షేర్ల కొనుగోలు వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో శివాజీ నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో టీవీ మాజీ సీఈఓ రవి ప్రకాష్‌తో పాటు శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. 
 
కానీ, శివాజీ మాత్రం విచారణకు డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు పారిపోతుండగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన పాస్ పోర్టును సీజ్ చేశారు.
 
ఈ సందర్భంగా ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. జూలై 11వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో శివాజీని ఎయిర్ పోర్టులో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు వచ్చి శివాజీని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments