Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ కోళ్లను చంపేశారు.. ఎక్కడ...?

Advertiesment
Madhya pradesh
, సోమవారం, 1 జులై 2019 (18:39 IST)
ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను ఫ్రీగా ఇవ్వలేదని ఇద్దరు దుండగులు కోళ్లను చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం నాడు చోటుచేసుకుంది.


ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుడ్డి భాయ్‌ అనే మహిళ తన కుమార్తెతో నివసిస్తూ జీవనాధారం కోసం కూలీగా పని చేస్తోంది. కూలీ డబ్బులతో ఇంటి అవసరాలు తీరకపోయే సరికి ఇంటి వద్దనే నాలుగైదు కోళ్లను పెంచుకుంటుంది. 
 
కోళ్లు పెట్టిన గుడ్లను అమ్ముకొని.. ఆ డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటుంది. ఆదివారం ఉదయం గుడ్డి భాయ్‌ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి, ఫ్రీగా ఓ కోడిని ఇవ్వాలని ఆమె కూతురిని కోరారు. ఆమె తిరస్కరించంతో కోపగించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడున్న ఒక కోడి పుంజును చంపేశారు. మిగతా నాలుగు కోళ్లకు విషాహారం తినిపించారు. 
 
దీంతో ఒకేసారి ఐదు కోళ్లు చనిపోయాయి. చివరకు ఇంటికి చేరుకున్న గుడ్డి భాయ్ చనిపోయిన కోళ్లను తీసుకొని ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది‌. కోళ్లను చంపేసిన సురేందర్‌, సుమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన్మోహన్ సింగ్‌కు మొండిచేయి చూపిన ఎంకే స్టాలిన్!