Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి..

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:25 IST)
హైదరాబాద్ యువతి ప్రపంచ అందాల పోటీల్లో దూసుకెళ్తోంది. వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన రోహిణినాయుడు ఫైనల్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగబోయే ఫైనల్స్‌లో ఆమె పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో పాల్గొని దాని ద్వారా తాను యూనివర్సల్‌ ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి దాదాపు 30 వేల మంది ఈ పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 172 మంది మాత్రమే ఫైనల్‌కు ఎంపియ్యారని, అందులో ఇండియా నుంచి తాను మాత్రమే ఎంపికైనట్లు చెప్పారు. 
 
వరల్డ్ మిసెస్ యూనివర్శల్ పోటీలు అక్టోబర్‌ నెలలో గ్రీస్‌లో జరగబోతున్నాయని, ఈ పోటీలకు ఎంపిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో భాగంగా నాలుగు వారాల పాటు వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, లింగ సమానత్వం తదితర అంశాలలో ఒక్కో వారం ఒక్కో అంశంపై నాలుగు టాస్క్‌‌లు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచుతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments