Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని విందుకు పిలిచి వైస్ ప్రిన్సిపాల్‌ అలా ప్రవర్తించాడు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:56 IST)
హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ కాలేజీ విద్యార్థినిని విందు పేరిట తన ఇంటికి పిలిచిన వైస్ ప్రిన్సిపాల్‌ ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకుని బయటపడ్డ యువతి ఈ నెల 9వ తేదీ రాత్రి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని అల్వాల్‌కి చెందిన ఓ యువతి రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాకు చెందిన కల్యాణ్ వర్మ ఇదే కాలేజీలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 29వ తేదీ సాయంత్రం విందు పేరుతో కల్యాణ్ వర్మ ఆ యువతిని తన ఇంటికి పిలిచాడు. దీంతో సోదరుడిని వెంటపెట్టుకుని ఆ యువతి అక్కడికి వెళ్లింది.
 
సోదరుడిని ఇంటి బయటే ఉండమని చెప్పి ఆమె మాత్రమే లోపలికి వెళ్లింది. ఆ సమయంలో కల్యాణ్ వర్మతో పాటు రవీందర్ అనే మరో లెక్చరర్ రవీందర్ కూడా అక్కడే ఉన్నాడు. కొద్దిసేపు యువతితో ముచ్చటించిన ఆ ఇద్దరు.. ఆపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న యువతి ఈ నెల 9న రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం