Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (13:04 IST)
ఇటీవల తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులకు హీరో విశాల్ తెరదించారు. తాను ఆరోగ్యంగా బాగానే ఉన్నట్టు చెప్పారు. ఆయన హీరోగా నటించిన మద గజ రాజా చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీ ఆదివారం విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోను శనివారం రాత్రి చెన్నైలోని ఓ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షో విరామ సమయంలో థియేటర్‌కు వచ్చిన ఆయన... ప్రీమియర్ షో చూస్తున్న ప్రేక్షకులు, మీడియాను ప్రత్యేకంగా అభినందించి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
 
'మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని
కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్టుగా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి' అని విశాల్ తెలిపారు. 
 
కాగా, విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మదగజరాజ' (Madha Gaja Raja). ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా గత వారం చెన్నైలో చిత్రబృందం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి. పూర్తి నీరసంగా కనిపించారు. దీంతో ఈవెంట్‌లో పాల్గొన్న వారు కంగారు పడ్డారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితమే పూర్తైనప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments