Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రమేష్ బాబు అంత్యక్రియలు - టాలీవుడ్ ప్రముఖుల నివాళులు

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (12:23 IST)
టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, హీరో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో జరుగనున్నాయి. ఆయన భౌతిక కాయానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియా వేదికగా తమతమ సంతాపాలను తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 
 
కాగా గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతూ వచ్చిన రమేష్ బాబు.. శనివారం గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించారు. అక్కడ కటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి కూడా పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. రమేష్ బాబు భౌతికకాయానికి అనేక మంది సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 
 
ఇదిలావుంటే, ఘట్టమనేని కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల సమయంలో గుమికూడకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని కోరింది. కాగా, రమేష్ బాబు అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే, హీరోగా 20కి పైగా చిత్రాల్లో నటించిన రమేష్ బాబు... కేవలం ఓ నటుడు మాత్రమే కాదు. నిర్మాత కూడా కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments