టాలీవుడ్ యువ హీరో తండ్రికి మూడేళ్ళ జైలు.. ఎందుకంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన తండ్రికి నకిలీ బంగారు కుదువపెట్టిన కేసులో కోర్టు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:22 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన తండ్రికి నకిలీ బంగారు కుదువపెట్టిన కేసులో కోర్టు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే..
 
రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు విశాఖపట్నంలోని వేపగుంటలో నివసిస్తుంటారు. ఆయన సింహాచలం ఎస్‌బీఐ బ్రాంచిలో 2013లో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేసే సమయంలో తన భార్య రాజ్యలక్ష్మితో పాటు అదే ప్రాంతానికి చెందిన ఎంఎస్ఎన్ రాజు, ఎన్. సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.85లక్షల రుణం తీసుకున్నారు. 
 
ఆ తర్వాత బ్యాంకు ఆడిటింగ్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం సీఐ నరసింహారావు దీనిపై ఓ నివేదికను కోర్టుకు అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు బసవరాజుకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments