Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నకూతురిని స్నేహితులకు గిఫ్ట్‌గా ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా కామాంధులు మహిళలపై విరుచుపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారా

Advertiesment
కన్నకూతురిని స్నేహితులకు గిఫ్ట్‌గా ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎక్కడ?
, గురువారం, 19 ఏప్రియల్ 2018 (13:30 IST)
ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా కామాంధులు మహిళలపై విరుచుపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. రక్తం పంచుకుపుట్టిన కన్నకూతురిపైనే కన్నేశాడు.



కన్నకూతురిపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. కన్నకూతురుని అతడి స్నేహితులకు కూడా పంచిపెట్టాడు ఆ దుర్మార్గుడు. తన స్నేహితులతో కలిసి కన్నకూతురిపై ఆ కామాంధ తండ్రి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిందితుడైన తండ్రి తన కూతురు (35)తో కలిసి ఏప్రిల్ 15 సాయంత్రం ఓ జాతరకు వెళ్లారు. అనంతరం అతడు తన స్నేహితుడైన మాన్ సింగ్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. స్నేహితులతో కలిసి జాతరకు వెళ్తున్నామని కూతురుకి నచ్చజెప్పాడు. ఆపై స్నేహితులతో పాటు నిందితుడు.. అతడి స్నేహితుడైన మిరాజ్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు.
 
ఆ ఇంట్లోనే కన్నకూతురిని తన స్నేహితులకు ఆ నీచ తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చాడు. స్నేహితులతో కలిసి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత 18 గంటల పాటు ఆమెను మిరాజ్ తన ఇంట్లోనే బంధించేశాడు. తండ్రి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో మిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి, అతడి మరో స్నేహితుడు మాన్ సింగ్ పరారీలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్‌ను కుక్క కరిచేసింది.. ఎక్కడ?