Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్ తల్లిని కూడా వదల్లేదట ఆ నటుడు... ఆయనకు ఇద్దరు పిల్లలు...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ద్వారా సినీ ఇండస్ట్రీలో ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో... ఎంతమంది బాధితులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వెలికి తీసుకువస్తారో చెప్పడం సాధ్యమయ్యేట్లు లేదు. ఎందుకంటే రోజుకొకరు తమపై ఫలానా నటుడు లైంగిక దాడి చేసాడంటూ ప్రకటిస్తున్నారు. తాజాగా అలియా భట్ తల్లి, మహేష్ భట్ భార్య అయిన సినీ నటి సోనీ ర‌జ్ధాన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
 
ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే... ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ కొత్తలో తనకు లైంగిక వేధింపులు ఎదురవ్వలేదట. కానీ ఆ తర్వాత ఓ నటుడు ఆమెపై అత్యాచార యత్నం చేశాడట. ఎంతో ప్రయత్నించాడట. చివరికి ఎలాగో అతడి బారి నుంచి తప్పించుకున్నానంటూ చెప్పుకొచ్చింది సోనీ. అతడి పేరు ప్రస్తుతం చెప్పి అతడిని ఇబ్బందులపాలు చేయదలుచుకోలేదన్న సోనీ... ఓ క్లూ మాత్రం ఇచ్చింది. సదరు నటుడికి ఇద్దరు పిల్లలు వున్నారంటూ బాంబు పేల్చింది. మరి ఇద్దరు పిల్లలున్న బాలీవుడ్ బిగ్ స్టార్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
మరో బాలీవుడ్ సెలబ్రిటీ అలోక్ నాథ్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ... అతడి చూపే తేడాగా వుంటుందని చెప్పారు. మ‌ద్యం తాగితే ఆయ‌న ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తాడనీ, హీరోయిన్ల పట్ల అతడి తీరు అస్స‌లు న‌చ్చ‌దంటూ బాంబు పేల్చారు. కాగా ఇప్పటివరకూ త‌నుశ్రీ ద‌త్తా, సోనా మ‌హాపాత్ర‌, వింటానందా, సంధ్యా మృదుల్, కంగనా రనౌత్ తదితర తారలు మీటూ అంటూ ఎన్నో విషయాలను చెప్పారు. తాజాగా ఈ జాబితాలో అలియా భట్ తల్లి కూడా చేరిపోయింది.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం