Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణాలో బీటెక్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

Advertiesment
Gang Rape
, ఆదివారం, 21 అక్టోబరు 2018 (12:03 IST)
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది. ఫేస్‌బుక్‌ వేదికగా యువతిని పరిచయం చేసుకున్న నిందితుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతేగాకుండా ఈ సంఘటనను మొబైల్‌లో చిత్రకరించాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వ్యవహారం బయటకు తెలిసింది.
 
బాధితురాలు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బాధితురాలికి నిందితుడు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి వంచించాడు. ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్‌ గ్రాండ్‌ లాడ్జ్‌కి తీసుకొచ్చి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా బాధితురాలు భయంతో విషయాన్ని బయటకు చెప్పలేదు. నిందితులు మణికంఠ, ధీరజ్‌, భాషాలుగా పోలీసులు గుర్తించారు. వీరి కోసం మూడు ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయి. బాధితురాలు సహకరిస్తే ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ద్వారా విచారించడానికి సన్నాహాలు చేస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమి కోసం తల్లీ కుమారుడు కలిసి తండ్రిని నరికేశారు.. ఎక్కడ?